టిఆర్ఎస్ నేతలకు పదవులు బిజెపి పెట్టిన బిక్ష: బండి సంజయ్

-

టిఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు బండి సంజయ్.టిఆర్ఎస్ పెట్టిన బిక్ష వల్లే తనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చిందంటూ టిఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు బండి సంజయ్.ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా పదవ రోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం అమరచింత మండలంలో పాదయాత్ర చేశారు బండి సంజయ్.పాదయాత్ర కిష్టం పల్లి చౌరస్తా వరకు చేరుకోగానే 100 కిలోమీటర్ల నడక పూర్తయిన సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు సంజయ్ పై పూలు చల్లి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా బండి ప్రసంగిస్తూ..ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు.

bandi-sanjay
bandi-sanjay

నరేంద్రమోడీ ఆధ్వర్యంలో నీతిమంతమైన పాలనను బిజెపి అందిస్తుందన్నారు.టిఆర్ఎస్ తోక పార్టీ అని, దొంగ దీక్షలు, దొంగ హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ అని విమర్శించారు.పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టేలా ఒత్తిడి తెచ్చి రాష్ట్రం వచ్చేలా చేసిన వ్యక్తి సుష్మా స్వరాజ్ అని బండి సంజయ్ గుర్తు చేశారు.ఆనాడు సుష్మాస్వరాజ్ ను తెలంగాణ ఆడపడుచుగా పొగిడిన కేసీఆర్..నేడు కనీసం ఆ ప్రస్తావన తీసుకు రాకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.తెలంగాణ రావడం వల్లే కెసిఆర్ కు సీఎం, ఆ పార్టీ నేతలకు పదవులు వచ్చాయని చెప్పారు.టీఆర్ ఎస్ వాళ్లకు పదవులు బిజెపి పెట్టిన భిక్ష అని గుర్తుంచుకోవాలని హితవు పలికారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news