గిరిజనుల బతుకులను ఆగం చేస్తున్నరు : బండి సంజయ్‌

-

తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ కుమార్‌, ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలను ఆపండి అంటూ అందులో పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం దళితులకు, గిరిజనులకు అసైన్‌ చేసిన భూములను లాక్కుంటూ రియల్‌ వ్యాపారం చేయడం దుర్మార్గం అంటూ ఆయన మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడం అంటే వారి నోటి కాడి ముద్ద లాక్కోవడమే అని బండి సంజయ్ అన్నారు.

బీఆర్ఎస్ నేతల రియల్ ఎస్టేట్ దందాకు దళితుల, గిరిజనుల భూములను గుంజుకుంటారా? దళిత, గిరిజనులంటే మీకెందుకు అంత కక్ష అని లేఖలో ప్రశ్నించారు బండి సంజయ్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు, గిరిజనులకు రక్షణ కరువైందన్నారు. దళితులు, గిరిజనుల బతుకులను ఆగం చేసే చర్యలను ప్రభుత్వం వెంటనే విడనాడాలన్నారు. అసైన్డ్‌ భూముల్లో రియల్‌ దందాకు తెరదించకుంటే బిజెపి తెలంగాణ శాఖ పక్షాన పెద్దఎత్తున ఆందోళన చేపడతామని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version