వారికి క్షమాపనలు చెప్పిన బండ్ల గణేష్.. ఎందుకో తెలుసా..!

-

ఎప్పుడూ ఏదో ఒక వార్తతో టీవీ ఛానల్స్ లో హాట్ టాపిక్ గా ఉండే తెలుగు సినీ పరిశ్రమ నిర్మాత, బండ్ల గణేష్ తాజాగా ట్విట్టర్‌లో చేసిన ఓ ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ‘తెలిసో తెలియకో నేను ఎవరినైనా బాధ పెట్టినా, తప్పు చేసినా, పెద్ద మనసుతో క్షమించండి’ అని బండ్ల గణేశ్ కోరారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు.

‘ఈ ఏడాది అందరూ సమస్యల్లో మునిగి ఉన్నారు. కొందరు ఆన్ లైన్ లో ఒకరి మనోభావాలను మరొకరు దెబ్బతీస్తున్నారు. అందరూ కలిసి అభివృద్ధి సాధించాల్సిన ఈ క్లిష్ట సమయంలో విద్వేషాన్ని పెంచే ధోరణి సరికాదు. ఓపిక, దయ, అర్థం చేసుకునే  తత్వాన్ని మరింత పెంచుకుంటూ ముందుకెళ్దాం’ అంటూ రతన్ టాటా చేసిన వ్యాఖ్యలను షేర్ చేశారు. దీనిపై ఆయన అభిమానులు మా గణేశన్న మనసు వెన్న అంటూ ఆ ట్వీట్ పట్ల స్పందిస్తున్నారు. ఇక ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బండ్ల గణేష్ కు సైతం సోకింది. ప్రస్తుతం బండ్ల గణేష్ చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news