ఢిల్లీ – సన్ రైజర్స్ మ్యాచ్ రద్దు : బీసీసీఐ కీలక ప్రకటన !

-

ఐపీఎల్‌ అభిమానులకు బీసీసీఐ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇవాళ రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్, మరియు ఢిల్లీ క్యాపిట్స్‌ మధ్య మ్యాచ్‌ యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేసింది బీసీసీఐ. కాగా… కొద్ది సేపటి క్రితమే సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేయర్‌ నటరాజన్‌ కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. నటరాజన్‌ కు కరోనా పాజిటివ్‌ రావడం తో మిగతా ఆటగాళ్ల లోనూ ఆందోళన మొదలైంది.

ఇక బౌలర్‌ నట రాజన్‌ తో పాటు, అతడికి సన్నిహితంగా ఉన్న టు వంటి… విజయ్ శంకర్‌ మరియు మిగతా ఐదుగురు స్టాఫ్‌ ను ఐసోలేషన్‌ కు పంపింది సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ యజమాన్యం. ఇక మిగతా ఆటగాళ్ల అందరికీ… కరోనా నెగిటివ్‌ రావడం తో మ్యాచ్ ప్రారంభానికి లైన్‌ క్లియర్‌ అయింది. కాగా…ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన SRH కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. దీంతో ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇప్పటి నుంచి ఆడుతున్న ప్రతి మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉండగా…. కుర్రాళ్లతో పటిష్టంగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టబోతుంది సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ జట్టు.

Read more RELATED
Recommended to you

Latest news