ఆసిఫాబాద్ జిల్లాలో ఎలుగుబంటి కలకలం.. ఇద్దరిపై దాడి

-

కుమురంభీం జిల్లా సిర్పూర్-టి మండలంలో ఎలుగుబంటి హల్​చల్ సృష్టించింది. వేర్వేరు చోట్ల తెల్లవారుజామున ఇద్దరిపై దాడి చేసింది. నవేల్లి గ్రామానికి చెందిన అవనిధర్ గౌడ్ గ్రామ శివారులో మార్నింగ్ వాక్​ కోసం వెళ్లిన వ్యక్తిపై పొదల్లో నుంచి ఒక్కసారిగా ఎలుగుబంటి దూకింది. ఈ ఘటనలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు ఎలుగుబంటిని అక్కడి నుంచి తరిమేశారు.

అదే ఎలుగుబంటి టోంకిని ప్రాంతంలో చౌదరి భువనేశ్వర్ మెుక్కజొన్న చేనుకు నీళ్లు పెట్టి వస్తుండగా మరో వ్యక్తిపై దాడి చేసింది. ఎలుగు నుంచి తప్పించుకునేందుకు ఆ రైతు తీవ్రంగా శ్రమించాడు. వీరిద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఎలుగుబంటి దాడి ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎలుగుబంటి సంచారం పై గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news