నీరజ్ హత్యా ను నిరసిస్తూ నేడు బేగం బజార్ బంద్

-

హైదరాబాద్‌ నిన్న మరో పరువు హత్య జరిగిన సంగతి తెలిసిందే. నీరజ్‌ అనే వ్యక్తిని అతని బామ్మర్దులే హత్య చేసారు. హైదరాబాద్‌ షాహి నాథ్ గంజ్ లో జరిగిన ఈ పరువు హత్యా కేసులో నీరజ్ ను హతమార్చిన ఆయన బావమరుదులు & స్నేహితులను కర్ణాటక గుడిమిత్కల్ లో పట్టుకున్నారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. నీరజ్ ను హత్యా చేసిన వెంటనే కర్ణాటక గుడిమత్కల్ ప్రాంతానికి పరార్ అయ్యారు నిందితులు.

యువకుడిని కత్తులతో పొడిచి చంపిన సంజన కజిన్ బ్రదర్స్ ను & వారి స్నేహితులను కర్ణాటక గుడిమత్కల్ నుండి హైదరాబాద్ తీసుకువచ్చారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. అయితే..ఈ హత్య నేపథ్యంలో బేగంబజర్ & షాహీ నాథ్ గంజి మార్కేట్ బంద్ పాటిస్తున్నారు వ్యాపార వేతలు.

నీరజ్ హత్యా ను నిరసిస్తూ బంద్ లో పాల్గొన్న వ్యాపారులు… తమకు న్యాయం కావాలని వ్యాపారులు ధర్నాకు దిగారు. కాగా.. ప్రస్తుతం ఉస్మానియా మార్చురీలో నీరజ్ మృతదేహం ఉంది.. మరికొద్దిసేపట్లో నీరజ్ డెడ్ బాడీకి పోస్టుమార్టం చేయనున్న వైద్యులు… పోస్టుమార్టం నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఉస్మానియా వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news