భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవానికి ముహూర్తం ఖరారు

-

భద్రాద్రి సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ప్రతి ఏడాది ఎంతో వైభవంగా నిర్వహించే రామయ్య కల్యాణానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సంవత్సరం సీతారాముల కల్యాణం మార్చి 30వ తేదీన నిర్వహిస్తున్నట్లు వైదిక కమిటీ నిశ్చయించింది. అదే విధంగా మార్చి 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తామని కమిటీ తెలిపింది.

ఈ ఏడాది జరిగే పట్టాభిషేకానికి ప్రత్యేకత ఉందని కమిటీ సభ్యులు చెప్పారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పట్టాభిషేకమని తెలిపారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 5 వరకు వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కల్యాణ సన్నాహిక బ్రహ్మోత్సవాలు జరపాలని ఆలయ వైదిక కమిటీ పెద్దలు నిర్ణయించారు. ఇటీవల భద్రాద్రిలో లడ్డూల నాణ్యతపై వివాదం తలెత్తిన సందర్భంగా శ్రీరామ నవమికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news