వైద్యారోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేయండి: భట్టి

-

ప్రభుత్వాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్​ చేశారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. హుజూరాబాద్‌, జమ్మికుంట ప్రభుత్వాసుపత్రులను సందర్శించారు.కొవిడ్​ నిర్ధారణ పరీక్షల తీరును అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వాస్పత్రుల్లోని లోపాలను బయటకు తీసుకొచ్చేందుకే పర్యటనలు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్యం వల్లే వైరస్ బారిన పడి ప్రజలు మరణిస్తున్నారని భట్టి ఆరోపించారు.

కొవిడ్​ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్​ చేశారు. వైద్యరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఆస్పత్రుల్లోనే వైద్య సిబ్బంది కొరత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అర్హతలేని వైద్యులు సూపరింటెండెంట్‌లుగా కొనసాగుతున్నారని ఆరోపించారు.హుజూరాబాద్‌ మండలం పెద్దపాపయ్యపల్లికి చెందిన ప్రవీణ్‌ యాదవ్‌ కుటుంబాన్ని భట్టి పరామర్శించారు. ప్రవీణ్​ మృతికి ఆస్పత్రి సూపరింటెండెంట్​, వైద్యారోగ్య శాఖ మంత్రే కారణమని భట్టి ఆరోపించారు.ఈ పర్యటనలో డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పాడి కౌశిక్‌రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news