నా తుది శ్వాస వరకు వై.ఎస్ కుటుంబంతోనే ఉంటా – భూమన కరుణాకర్ రెడ్డి

-

నా రాజకీయ జీవితం అంతా వై.ఎస్ కుటుంబంతోనే ఉంటానని.. నా ఆఖరి తుది శ్వాస వరకు వై.ఎస్ కుటుంబంతో కొనసాగుతానని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. తమహాత్మాగాంధీ ఆత్మకథ పుస్తకం సి.ఎస్. ఎన్వీ రమణ చేతులు మీదుగా ఆవిష్కరణ చేశామని.. ఈ సందర్భం గా నేను చేసిన ప్రసంగాన్ని కొద్ది మంది దురుద్దేశ్యం ఆపాదించి మహాత్ములు తన జీవితంలో చెప్పిన మాటలు వేరుగా ప్రకటించి నేనేదో మా నాయకుడు, సీఎం జగన్ పై నేను మాట్లాడినట్లు వక్రీకరించడం నాకు చాలా బాధ కల్గిందని ఫైర్ అయ్యారు.

నేను చాలా నిబద్దత కల్గిన వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ సైనికుడినని.. కొద్ది మంది నావాఖ్యలు ఆపాదించి వేరుగా వక్రీకరించడం నాకు చాలా బాధ కలిగిందన్నారు. వై.ఎస్ కుటుంబం తో 48 ఏళ్లు అనుబంధమని… నేను తీవ్రవాద రాజకీయాల నుంచి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభావం వలనే ప్రజాస్వామ్య రాజకీయాల్లో వచ్చానని వెల్లడించారు. రాజ శేఖర్ రెడ్డి, ఆయన కుటుంబానికి రాజకీయ సేవ చేసుకోవడానికే వచ్చా..ప్రజా స్వామ్య రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. నేను తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం వై.ఎస్.కుటుంబం తోనే సాగుతానని వెల్లడించారు భూమన.

Read more RELATED
Recommended to you

Latest news