తెలంగాణ రైతులకు బిగ్‌ షాక్‌..రైతు బీమాలో 33 లక్షల మందికి కోత !

-

తెలంగాణ రైతులకు బిగ్‌ షాక్‌..రైతు బీమాలో 33 లక్షల మందికి కోత పడింది. వయసు నిబంధన రైతు కుటుంబాల జీవిత బీమా రక్షణకు ప్రధాన అడ్డంకిగా మారింది. రైతు బీమా పథకం కింద 18 నుంచి 59 ఏళ్లలోపు వయసున్న రైతులే అర్హులని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించడం వల్ల 33 లక్షల మంది అనర్హులయ్యారు. భారతీయ జీవిత బీమా సంస్థకి ఏటా ప్రభుత్వం రైతుల తరపున ప్రీమియం చెల్లిస్తోంది.

ఒకవేళ రైతు ఏదైనా కారణంతో మరణిస్తే నామినీకి రూ. 5 లక్షల పరిహారాన్ని ఎల్ఐసి చెల్లిస్తుంది. 2018-22 మధ్య 4 ఏళ్లలో 92,203 మంది రైతులు మృతి చెందగా, పరిహారం కింద రూ. 4,610 కోట్లు చెల్లించింది. ప్రస్తుత యాసంగి సీజన్ లో మొత్తం 70 లక్షల మందికి రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.5 వేల చొప్పున ఇస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ గత నెలలో వెల్లడించింది. కానీ, రైతు బీమా పథకం కింద ఈ ఏడాది ప్రభుత్వం 37. 76 లక్షల మందికి సంబంధించిన ప్రీమియం మాత్రమే చెల్లించింది. రాష్ట్ర అర్ధగణాంక శాఖ తాజా గణాంకాల నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం, రాష్ట్రంలోని రైతుల్లో దాదాపు సగం మందికి బీమా సదుపాయం అందుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news