Big Diwali sale: షాపింగ్ ప్రియులకు ఫ్లిప్ కార్ట్ గుడ్ న్యూస్.. వాటిపై భారీ డిస్కౌంట్‌..

-

పండుగలు వస్తున్నాయి అంటే నెల రోజుల నుంచి ఈ కామర్స్ సంస్థలు కొన్ని బ్రాండ్ వస్తువుల పై భారీ డిస్కౌంట్‌ ను అందిస్తూ వస్తున్నాయి. మొన్నామధ్య దసరాకు భారీ ఆఫర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.. అప్పుడు పెట్టిన ఆఫర్లతో భారీ సెల్ ను అందుకుంది ఫ్లిప్‌కార్ట్.. ఒక్క ఫ్లిప్‌కార్ట్ మాత్రమే కాదు ఈ కామర్స్ సంస్థలు అన్నీ కూడా కస్టమర్స్ కు ఆఫర్లను ప్రకటించాయి.

ఇప్పుడు దీపావళి పండుగ సందర్భంగా కొన్ని వస్తువుల పై ఆఫర్స్ ను అందిస్తున్నారు. ఈ క్రమంలో ఫ్లిప్‌కార్ట్‌ ఓ సేల్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 16వ తేదీతో ఈ సేల్‌ పూర్తయింది. అయితే తాజాగా ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌ను తీసుకొచ్చింది. బిగ్‌ దీపావళి సేల్‌ పేరుతో అక్టోబర్‌ 19 నుంచి 23వ తేదీ వరకు సేల్‌ను నిర్వహించనుంది. ఐదు రోజుల పాటు సాగనున్న ఈ సేల్‌లో పలు ప్రొడక్ట్స్‌పై భారీ ఆఫర్లను ప్రకటించాయి. ఇదిలా ఉంటే ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉన్న వారికి ఒక రోజు ముందు నుంచే (అక్టోబర్ 18) సేల్‌ అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్‌లు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తున్నారు.

అంతేకాకుండా ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేసే వారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ను పొందొచ్చు. అలాగే పేటీఎం వ్యాలెట్‌, యూపీఐ లావాదేవీల ద్వారా కొనుగోళ్లు చేసేవారికి ఫ్లిప్‌కార్ట్‌ 10 శాతం తక్షణ క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనుంది.. ఈ మేరకు కొన్ని స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్ల పై ప్రత్యేక ఆఫర్లను అందించనున్నారు. రియల్‌మీ సీ33, పోకో సీ 31, ఒప్పో కే 10 ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లను అందించనున్నారు. ఇతర ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు, యాక్సెసరీస్‌ పై 80 శాతం వరకు, టీవీలు, వాషింగ్‌ మిషిన్లు, ఏసీలపై 75 శాతం డిస్కౌంట్‌ ను అందించనున్నారని తెలుస్తుంది..త్వరపడండి..

Read more RELATED
Recommended to you

Latest news