సుప్రీంకోర్టు లో గాలి జనార్దన్ రెడ్డికి ఊరట

-

ఢిల్లీ సుప్రీంకోర్టు లో గాలి జనార్దన్ రెడ్డికి ఊరట లభించింది. గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ షరతులు సడలించిన సుప్రీంకోర్టు… గాలి జనార్ధన్ రెడ్డి బళ్లారి,కడప, అనంతపూర్ వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. మూడు ప్రాంతాలకు వెళ్లేప్పుడు, తిరిగి వచ్చేపుడు గాలి జనార్ధన్ రెడ్డి… జిల్లా ఎస్పీలకు తెలియజేయాలన్న సుప్రీంకోర్టు….గాలి జనార్ధన్ రెడ్డి పై ఉన్న అక్రమ మైనింగ్ కేసులను విచారణ వేగవంతం చేయాలని ట్రయల్ కోర్టుకు సూచించింది.

బళ్లారి,కడప, అనంతపూర్ వెళ్ళేందుకు అనుమతిస్తు 8 వారాల పాటు బెయిల్ షరతులు సడలింపులు చేసింది సుప్రీం కోర్టు. తదుపరి విచారణ నవంబర్ మూడో వారానికి వాయిదా వేసింది. అయితేగాలి బెయిల్ షరతులు సడలించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది సీబీఐ. అటు ఇప్పటి వరకు గాలి జనార్ధన్ రెడ్డి ఎటువంటి షరతులు ఉల్లంఘించలేదు..బళ్లారి, కడప, అనంతపూర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు గాలి జనార్ధన్ తరపు న్యాయవాదులు. వాదనలను విన్న సుప్రీంకోర్టు ఎట్టకేలకు అనుమతులు ఇచ్చింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news