జగన్ సొంత జిల్లాలోనే భారీ స్కాం…!

-

గత కొన్నాళ్ళుగా ఆంధ్రప్రదేశ్ లో సిఎం సహాయ నిధి అవినీతి వ్యవహారం సంచలనంగా మారింది. ఈ దోపిడిపై విచారణ కొనసాగుతుంది. రహస్యంగా విచారిస్తున్నారు అధికారులు. ప్రొద్దుటూరు కేంద్రంగా సిఎం ఆర్ ఎఫ్ భారీ స్కామ్ నడిచింది అని అధికారులు పేర్కొన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులే కీలక పాత్ర పోషించారు అని గుర్తించారు. ప్రొద్దుటూరు లో ఇప్పటికే స్వచ్చందంగా పోలీసుల ముందు లొంగిపోయాడు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి.

ప్రొద్దుటూరు ఎస్ బిఐ లో 10 లక్షల ఫేక్ చెక్కులను డ్రా చేసినట్లు ఒప్పుకున్నాడు భాస్కర్ రెడ్డి. స్ధానిక ఎమ్మెల్యే దగ్గర వున్న చెన్నకేశవరెడ్డి దగ్గర 3 ఖాళీ చెక్కులను తీసుకున్నట్లు చెప్పిన భాస్కర్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. ఇక ఇతర రాష్ట్రాల బ్యాంకుల్లో కూడా ఈ మోసం ఎక్కువగా జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news