బీజేపీకి బిగ్ షాక్.. తెలుగుదేశం పార్టీలో చేరనున్న పరిపూర్ణానంద స్వామి..?

-

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో ఒక పార్టీలోని నాయకులు మరొక పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ నేత, శ్రీ పీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు.ఈ మేరకు ఆయన వెంటే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు కూడా ఉన్నారు. దీంతో, ఆయన టీడీపీలో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. మొదట బీజేపీ నుంచి హిందూపురం ఎంపీ సీటు ఆశించిన పరిపూర్ణానందకు బిజెపి షాకిచ్చింది. పార్టీకి కష్టపడి సేవ చేసినప్పటికీ టికెట్‌ దక్కకపోవడంతో హైకమాండ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

కాగా, స్వామి పరిపూర్ణానంద ముందు హిందూపురం లోక్ సభ లేదా అసెంబ్లీ స్థానాల నుంచి అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, హిందూపురంలో ఎక్కడ మైనారిటీ ఓట్లు పడవనే అనుమానంతోనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని.. పొత్తుల కారణంగానే తనకు టికెట్ రాకుండా చేశారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, హిందూపూరం లోక్ సభ అభ్యర్థిగా టీడీపీ నేత బీకే పార్థసారథి పోటీ చేస్తుండగా, అసెంబ్లీకి నందమూరి బాలకృష్ణ మరోసారి బరిలోకి దిగబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news