ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట :రఘురామరాజు

-

గత ఎన్నికల్లో రఘురామరాజు వైసీపీ తరపున పోటీ చేసి నరసాపురం ఎంపీగా గెలుపొంది, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వైసీపీని విభేదించి రెబల్ ఎంపీగా మారారు. ఈసారి ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అనూహ్యంగా టీడీపీ నుంచి రఘురామ రాజు టికెట్ దక్కించుకున్నారు.చివరకు పశ్చిమగోదావరి జిల్లా ఉండి స్థానంలో ఆయన పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో తొలుత సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఆ నియోజకరవర్గంలో నియోజకవర్గంలో వర్గ విబేధాలు తలెత్తాయి. అయితే శివరామరాజును చంద్రబాబు ఒప్పించారు. రామరాజుకే సీటు ఇస్తామని ప్రకటించారు.

అయితే నామినేషన్ల వేళ ఉండి నియోజకవర్గం అభ్యర్థి రామరాజును మార్చి అదే సీటును రఘురామకృష్ణంరాజుకు కేటాయించారు. దీంతో సోమవారం నామినేషన్ వేసేందుకు రఘురామరాజు సిద్ధమవుతున్నారు. బీఫామ్ తీసుకుని ఉండిలో తాను నామినేషన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని, రామరాజు, తాను కలిసే ముందుకు వెళ్తామని వెల్లడించారు. తాను ఎంపీ స్థానాన్ని ఆశించానని, ఎమ్మెల్యే అయినా పర్వాలేదని పేర్కొన్నారు. ఎంతమంది వచ్చినా ఉండిలో తన గెలుపును ఆపలేరని రఘురామరాజు ఆశాభావం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news