కడపలో చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు… షాక్ ఇచ్చిన అధికారులు

-

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ అధినేత చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అయితే పార్టీ బలోపేతం కోసం, కార్యకర్తలలో మళ్ళీ కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు సిద్దమయ్యారు. అందులోనే భాగంగా చంద్రబాబు సోమవారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ కోటిరెడ్డి సర్కిల్‌లో టీడీపీ జెండాలు, బ్యానర్లు కట్టారు. అయితే వీటిని మున్సిపల్ అధికారులు తొలగించారు.

అనుమతులు లేవంటూ బ్యానర్లు, టీడీపీ జెండాలను తొలగించారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలే తమ పార్టీ జెండాలు, బ్యానర్లు తొలగించేందుకు అధికారులను ఉసిగొల్పారని ఆరోపించారు. ప్రజల్లో తమకు పెరుగుతున్న మద్దతును చూసి వైసీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news