Samantha: బిగ్ అప్‌డేట్..సమంత ‘యశోద’ నుంచి గ్లింప్స్ రిలీజ్..ఎప్పుడంటే?

-

బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత..ప్రజెంట్ తన కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టేసింది. ఆమె లీడ్ రోల్ ప్లే చేసిన ఫిల్మ్ ‘శాకుంతలం’..రిలీజ్ డేట్ పై త్వరలో క్లారిటీ రానుంది. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ పిక్చర్ లో సమంత..తన అభినయంతో ప్రేక్షకులను అమితంగా అలరిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సమంత లీడ్ రోల్ ప్లే చేస్తున్న మరో పాన్ ఇండియా పిక్చర్ ‘యశోద’ నుంచి..బిగ్ అప్ డేట్ ఇచ్చేశారు మేకర్స్. హ‌రీష్ శంక‌ర్‌, హ‌రీష్ నారాయ‌ణ్ సంయుక్తంగా డైరెక్ట్ చేస్తున్న ఈ పిక్చర్ కు సంబంధించిన గ్లింప్స్‌ను ఈ నెల 5న ఉద‌యం 11.07 గంటలకు విడుద‌ల చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.

ఈ ‘యశోద’ పిక్చర్ లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్, ఉన్నీ ముకుంద‌న్ కీలక పాత్రలు పోషిస్తుండగా, మెలోడీ బ్రహ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. శ్రీదేవీ మూవీస్ బ్యానర్ పై శివ‌లెంక కృష్ణ ప్రసాద్ పిక్చర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ..తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్, కన్నడ, మ‌ల‌యాళం భాష‌ల్లో ఈ ఏడాది ఆగ‌స్టు 12న విడుద‌ల చేయాల‌ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మరో వైపున సమంత నటించిన ‘కాతు వాకుల రెండు కాదల్’ పిక్చర్ విడుదలై చక్కటి టాక్ తో దూసుకుపోతున్నది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరో కాగా, మరో హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించింది. ట్రయాంగిల్ లవ్ స్టోరిగా వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్స్ నయనతార, సమంత, విజయ్ సేతుపతిల నటనపై ప్రముఖులు, సినీ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news