Bigboss7: నిహారిక ఫ్రెండ్..ప్రముఖ యూట్యూబర్ కి దక్కిన అవకాశం..!

-

బిగ్ బాస్ తెలుగులో భారీ పాపులారిటీ దక్కించుకున్న విషయం తెలిసిందే. 2017లో మొదటి సీజన్ ప్రారంభించగా.. గత ఏడాది డిసెంబర్ 18న ఆరవ సీజన్ కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఏడవ సీజన్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు బిగ్ బాస్ నిర్వాహకులు. అందులో భాగంగానే పాపులర్ సెలబ్రిటీలను అలాగే ముందు సీజన్ లలో రన్నరప్పులుగా నిలిచిన వాళ్లను సంప్రదిస్తున్నట్లు సమాచారం. బిగ్ బాస్ తెలుగు సిక్స్ సీజన్లో గతంలో ఎన్నడూ చూడని సరికొత్త కంటెంట్ ను తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా పూర్తి చేసే ప్రయత్నం చేశారు నిర్వాహకులు. ఊహించని సంఘటనలతో గొడవలు , వెటకారాలు, ఫ్రెండ్షిప్, లవ్ ట్రాక్ , రొమాన్స్ ఇలా ఎన్నో ట్విస్టులతో సాగిన ఆరో సీజన్ ఫినాలేలో కూడా ట్విస్ట్ ఎదురయింది. మొత్తంగా ఈ సీజన్ లో ప్రైజ్ మనీ ఒకరికి.. ట్రోఫీ మరొకరికి సొంతం అయ్యింది.

అంతేకాదు ఆరవ సీజన్లో జరిగిన ఫేక్ ఎలిమినేషన్స్ రాజకీయ ప్రభావంతో కొంతమంది నిజాయితీగల కంటెస్టెంట్ లకి అన్యాయం జరిగిందని విమర్శలు రావడంతో ఆరవ సీజన్ తర్వాత నాగార్జున హోస్టింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి నిహారిక కొణిదెల కోరిక మేరకు ప్రముఖ యూట్యూబర్ కి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు వన్ సీజన్ 1 లో రన్నర్ గా నిలిచిన ఆదర్శ బాలకృష్ణ, హీరో నవదీప్ ను అప్రోచ్ అయిన బిగ్బాస్ టీం తాజాగా ప్రముఖ యూట్యూబ్ నిఖిల్ విజయేంద్ర సింహతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.

నిఖిల్ ప్రస్తుతం యూట్యూబర్ గా బాగానే పాపులర్ అయ్యాడు. ఇప్పటికీ ఎంతో మంది సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు చేయడంతో పాటు పలు ప్రోగ్రామ్స్ కి హోస్టుగా కూడా వ్యవహరించారు. అంతేకాదు మెగా డాటర్ నిహారిక కు మంచి స్నేహితుడు కావడంతో ప్రస్తుతం ఈయనకు అవకాశం ఇవ్వడానికి బిగ్ బాస్ నిర్వాహకులు ముందుకు వచ్చినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news