మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ ఢీ కొని బైకర్ మృతి

-

చిత్తూరు జిల్లా పలమనేరులో విషాదం చోటుచేసుకుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌ వాహనం ఢీకొని ఓ బైకర్ మృతి చెందాడు. కాన్వాయ్ లో ఉన్న మంత్రి వాహనాలను ఆపి ఘటనాస్థలికి పరిశీలించారు. బైకర్ మృతిపై విచారం వ్యక్తం చేశారు.

చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండల కేంద్రంలో మదనపల్లి – పలమనేరు జాతీయ రహదారిపై వెళ్తున్న మంత్రి కాన్వాయ్ లో పోలీసు జీపు.. ఎదురుగా వస్తున్న బైక్‌ పరస్పరం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బైకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాన్వాయ్ డ్రైవర్ కూడా స్వల్పంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో బైక్ వెనకాల టమోటో లోడ్‌తో వస్తున్న మరో వాహనం బోల్తా పడింది. ఆ వాహనంలోని డ్రైవర్‌కు గాయాలయ్యాయి.

కాన్వాయ్‌లో వెనుక వాహనంలో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news