17వ రౌండ్ లో బీజేపీ కి 1,423 ఓట్ల ఆధిక్యం

-

హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల్లో బిజెపి పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేందర్ గెలుపు దిశగా దూసుకు పోతున్నాడు. కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి లీడింగ్ లో ఉన్న ఈటల రాజేందర్… 17వ రౌండ్ వరకు తన లీడింగ్… కొనసాగించారు.

Huzurabad | హుజురాబాద్

కాసేపటి క్రితమే 17వ రౌండు ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఈ 17వ రౌండులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఏకంగా 1423 ఓట్ల ఆధిక్యం లభించింది. దీంతో ఓవరాల్ గా చూస్తే బిజెపి పార్టీకి 14618 ఓట్ల మెజారిటీ దక్కింది. ఇక 17వ రౌండ్ ఫలితాలు వెలువడే సరికి బిజెపి పార్టీకి 79, 785 ఓట్లు పోల్ కాగా… టిఆర్ఎస్ పార్టీకి 65,167 ఓట్లు ఓట్లు పోల్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news