దేశవ్యాప్తంగా బీజేపీ లో కీలక మార్పులు… కారణం అదేనా ?

-

భారతదేశంలో పాలన బీజేపీ చేతిలో ఉంది, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఒక మాదిరిగా జరుగుతోంది. అయితే కొన్ని నిర్ణయాలు దృష్ట్యా బీజేపీ ప్రజల మనసుల్లో చాలా బలహీనంగా మారిపోయింది. ఈ బలహీనత కొన్ని రాష్ట్రాలలో గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే రోజుల్లో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా వారికి కఠినమైన సవాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందుకే బీజేపీ అధిష్టానం ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా బీజేపీలో రాష్ట్రాల అధ్యక్షులను మార్చనుంది. ఇప్పటికే ఒక లిస్ట్ ను రెడీ చేసుకున్న బీజేపీ అధిష్టానం .. ఈ సాయంత్రానికి విడుదల చేయనుంది. తెలంగాణ తో పాటుగా కొన్ని రాష్ట్ర సారధులను మార్చనుంది. ఇంకా కొందరి నాయకులను జాతీయ నాయకత్వంలోకి తీసుకోవడానికి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరి ఈ మార్పులు ఏమిటి ? ఏ ఏ రాష్ట్రాలలో సారధులను మారుస్తున్నారు అన్నది తెలియాలంటే మరికొంతసేపు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news