ఆ ఏపీ మంత్రిపై రూ. 10 కోట్ల పరువు నష్టం దావా.. ఏం జ‌రిగిందంటే..?

-

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా అప్పటి మంత్రి రావెల కిశోర్ బాబుకు అమరావతిలో 40 ఎకరాలు ఉన్నట్టు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బుగ్గనపై మాజీమంత్రి, బీజేపీ నేత రావెల కిశోర్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనపై మంత్రి బుగ్గన చేసిన ఆరోపణలను ఖండిస్తున్నానని ఆయన తెలిపారు. తనకు రాజధాని ప్రాంతంలో భూములు ఉన్నాయనడం అవాస్తవమని ఆయన అన్నారు. ఈ విషయంలో తనపై అనవసర ఆరోపణలు చేసిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై రూ. 10 కోట్లకు పరువు నష్టం దావా వేయబోతున్నట్టు రావెల కిశోర్ బాబు తెలిపారు.

తన నోటీసు అందిన తరువాత బుగ్గన తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుల మనోభావాలను ఆయన కించపర్చారని రావెల కిశోర్ బాబు ఆరోపించారు. రాజధానిని తరలించేందుకు కుట్ర జరుగుతోందని రావెల ఆరోపించారు. వైసీపీ అనుకూల మీడియా దీనిపై గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news