ఎమ్మెల్యే మైనంపల్లిపై హత్యాయత్నం ఆరోపణలు చేసిన బీజేపీ నేత

-

అదృశ్యమైన స్థిరాస్థి వ్యాపారి, జనగామ జిల్లాకు చెందిన తిరుపతి రెడ్డి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. మంగళవారం డీసీపీ ఆఫీసులో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యక్షమయ్యారు. ఈ క్రమంలో తిరుపతి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిడ్నాప్ చేసి తనను చంపాలని చూశారని ఆయన పేర్కొన్నారు. దీంతో విజయవాడ పారిపోయి తలదాచుకున్నానని తిరుపతి రెడ్డి చెప్పారు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నుంచి తనకు ప్రాణహానీ వుందని ఆయన ఆరోపించారు. తనను ఎంత బెదిరించినా.. తన స్థలం కబ్జా కానివ్వనని తిరుపతి రెడ్డి స్పష్టం చేశారు.

Tirupati Reddy Kidnapping Case : స్థిరాస్తి వ్యాపారి తిరుపతిరెడ్డి ఆచూకీ లభ్యం.. అసలేం జరిగింది?, bjp-leader-mukkera-tirupati -reddy-kidnapping-case-update-real-estate-dealer-kidnap-case-hyderabad

మైనంపల్లి అనచరులు తన భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. మైనంపల్లి తనకు 8 సార్లు ఫోన్ చేశారని చెప్పారు. ఎమ్మెల్యే అనుచరులు బెదిరించడం వల్లే తాను ఆటోలో వెళ్లాల్సి వచ్చిందన్నారు. హైకోర్టు అడ్వకేట్ సలహా మేరకు తాను డీసీపీ ఆఫీసుకు వచ్చానని చెప్పారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news