పథకాలతో వైసీపీ ప్రజలను సోమరులను చేస్తున్నారు: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి !

-

ఏపీలో ప్రస్తుతం వైసీపీ వలన ప్రజలు ఏ విధంగా మారుతున్నారో అని బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడారు. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని మొదటి నుండి బీజేపీ తీక్షణంగా గమనిస్తోందని, దోపిడీని ప్రధాన అజెండాగా పెట్టుకుని ముందుకు వెళుతున్నారన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై కేసులు బనాయిస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఇక సంక్షేమ పధకాల గురించి గొప్పగా చెప్పుకుంటున్న వైసీపీ.. ఈ పధకాల వలన ప్రజలకు మేలు జరగడం మాట అటుంచితే రాను రాను ఏ పనీ చేయకుండా సోమరిపోతులు లాగా తయారవుతున్నారని చెప్పారు.

గెలవడమే లక్ష్యంగా పెట్టుకుని ఓటర్లను ఆకట్టుకోవడానికి మతరాజకీయాలను చేస్తున్నారు అంటూ ప్రభుత్వంపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెబుతామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news