బెంగళూరులో మోదీ మెగా రోడ్ షో.. భారీగా తరలివచ్చిన కాషాయ శ్రేణులు

-

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ మోదీ బెంగళూరు సౌత్​ నియోజకవర్గంలో 26.5 కిలోమీటర్ల మెగా రోడ్ షో చేపట్టారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రోడ్​ షో మధ్యాహ్నం 12.30 గంటల వరకు సాగింది. సోమేశ్వర్​ భవన్​ నుంచి బెంగళూరు సౌత్​లోని మల్లేశ్వర్​ సంకి ట్యాంక్​ వరకు దాదాపు 26.5 కిలోమీటర్లు ఈ రోడ్ షో సాగింది. ఆదివారం 8 కిలోమీటర్ల మేర మరో రోడ్​షో చేపట్టనున్నారు ప్రధాని మోదీ. కెంపెగౌడ విగ్రహం నుంచి ట్రినిటీ సర్కిల్​ వరకు సాగనుంది.

నగరంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి.. ప్రజలను కలుసుకునేందుకు రెండు రోజుల రోడ్​ షో పెట్టారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఒక రోజులో నగరమంతా పర్యటిస్తే.. ప్రజలకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించాయి. నగరంలోని సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని బీజేపీ ఎలక్షన్​ నిర్వహణ కమిటీ కన్వీనర్​ శోభా కరంద్లాజే చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news