సిఎం కేసీఆర్ ఒక హిట్లర్.. రెచ్చి పోయిన ఏపీ బీజేపీ నేత

-

ఏపీ – తెలంగాణ వివాదంపై స్పందించిన ఏపీ బిజెపి నాయకుడు విష్ణు వర్ధన్ రెడ్డి.. తెలంగాణ సిఎం కెసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా రైతులపై కడుపు మంటతో ఉద్దేశపూర్వకంగా నీళ్లను సముద్రంలోకి పంపించిన చరిత్ర సిఎం కెసిఆర్ కు మాత్రమే దక్కుతుందని ఫైర్ అయ్యారు. చరిత్రలో సిఎం కెసిఆర్ రైతు ద్రోహిగా నిలుస్తారని.. నేటి సమాజం హిట్లర్ ను చూడలేదు కాని.. హిట్లర్ రూపంలో ఉన్న కేసీఆర్ గారిని ప్రత్యక్షంగా తెలుగురాష్ట్రాల ప్రజలు చూస్తున్నారని చురకలు అంటించారు.

పులిచింతలలో తెలంగాణ జెన్‌కో అసందర్భంగా, దౌర్జన్యంగా విద్యుత్ ఉత్పత్తి చేసిన కారణంగా 7,400 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తోందని తెలంగాణ ప్రభుత్వమని మండిపడ్డారు. దీంతో ప్రకాశం బ్యారేజీ నుండి ఐదు గేట్ల ద్వారా 8,600 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేసారని… మరిన్ని గేట్లుఎత్తి వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వృధాగా పంపుతున్నారని పేర్కొన్నారు.

కెసిఆర్ చేసిన అన్యాయం ఆంధ్రా రైతులకు మాత్రమే కాదని…ఈ దేశ రైతులందరికీ చేస్తున్న ద్రోహమని ఫైర్ అయ్యారు. చరిత్ర ఎన్నటికీ మీ అనైతిక అహంకార, పిచ్చి చర్యలను మరచిపోదని… స్వార్థ రాజకీయాల కోసం మీరు చేస్తున్న దుర్మార్గాలకు, తెలంగాణ రైతులు సైతం బుద్ది చెప్పే రోజు వస్తుందని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news