రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా

-

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటుగా నూతనంగా రాజ్యసభకు ఎన్నికైన మరో ఐదుగురు రాజ్యసభ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

నడ్డాతో పాటుగా ఐదుగురు ఎంపీలతో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ పార్లమెంట్ హౌస్‌లో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేయించారు. వీరిలో రాజ్యసభ సభ్యులుగా బీజేపీకి చెందిన చున్నిలాల్ గరాసియా,అశోకరావు శంకర్‌రావు చవాన్,మహ్మద్ నడిముల్ హక్, ఏఐటీసీకి చెందిన సుస్మితా దేవ్, కాంగ్రెస్‌కు చెందిన అనిల్ కుమార్ యాదవ్ మందాడి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభ్యులంతా కలిసి రాజ్యసభ చైర్మన్‌, ఉపరాష్ట్రపతితో గ్రూప్‌ ఫొటో దిగారు.

Read more RELATED
Recommended to you

Latest news