కవిత విషయంలో బండి సంజయ్‌ చేసింది ముమ్మాటికి తప్పే – బీజేపీ నేత

-

కవిత విషయంలో బండి సంజయ్‌ చేసింది ముమ్మాటికి తప్పేనని బీజేపీ నేత పేరాల శేఖర్ రావు ఫైర్‌ అయ్యారు. ధర్మపురి అరవింద్‌ నిన్న మాట్లాడింది 100% కరెక్టని.. కిషన్ రెడ్డి గారో,లక్ష్మణ్ గారూ,ఇతర పెద్దలు చేయాల్సిన పని ఆయన చేశారన్నారు. అధ్యక్షుని పరిణతి లేని అసందర్భ మాటలు, వ్యవహారం, నియంతృత్వం, అప్రజాస్వామిక చేష్టలు bjp లో ఈ పరిస్థితికి కారణమని నిప్పులు చెరిగారు.

అన్ని మసీదుల తవ్వకాలు, ముద్దులు పెట్టడాలు, బ్లాక్మెయిల్, ఇష్యూలు లేవదీసి అంతర్గతంగా సెటిల్‌మెంట్లు, సుదీర్ఘ కాలంగా ఉన్న కార్యకర్తలకు అవమానం, ఒంటెద్దు పోకడలు, వ్యక్తిగత ఆర్థిక స్వార్థాలు-మన పార్టీ సంస్కృతి కాదు, అయినా యధేచ్చగా నడుస్తున్నాయని ఆగ్రహించారు. దీనికి కారణం రాష్ట్ర నాయకత్వం స్వయంకృతాపరాధాలే.. KCR-TRS పతనం అవుతున్న సమయంలో,ఇది మన దురదృష్టమన్నారు. కేంద్ర పార్టీ పెద్దఎత్తున మద్దతు ఇస్తున్నా ఉపయోగించుకోలేక పోతున్నామని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news