కరోనా కలకలం : బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫ్యామిలీ మొత్తానికి..!

-

తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. కరోనా నియంత్రణలో భాగంగా నిత్యం శ్రమిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలే తెలంగాణలో పలువురు నాయకులు చెందిన సహాయ సిబ్బంది వైరస్ సోకింది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ గన్‌మెన్ బలరాం యాదవ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న బలరాం.. పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గన్‌మెన్‌కు కరోనా అని తేలడంతో మా కుటుంబ సభ్యులతో పాటు నేను కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నానని రాజా సింగ్ ట్వీట్ చేసారు. రెండు రోజుల్లో రిపోర్టులు రావచ్చు అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news