ఆవు మూత్రం తాగితే కరోనా ఆగిపోద్ది: బిజెపి ఎమ్మెల్యే

-

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న నేపధ్యంలో ఇప్పుడు కాస్త ప్రజల్లో భయం ఎక్కువగా ఉంది. దాని నుంచి ఏ విధంగా బయటపడాలి ఏంటీ అనే దానిపై అందరూ కూడా తమ వంతుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్ బిజెపి ఎమ్మెల్యే ఒకరు ఇచ్చిన సలహా వివాదాస్పదం అయింది. గో మూత్రం తాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

బల్లియా జిల్లాలోని బైరియాకు చెందిన ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ తాను ఆవు మూత్రం తాగే వీడియోను కూడా పోస్ట్ చేసారు. ఈ వైరల్ అయిన వీడియోలో ఆవు మూత్రాన్ని ఎలా తీసుకోవాలో కూడా చెప్పారు. కోవిడ్ -19 వ్యాప్తిని ‘గౌముత్రా’ ఉపయోగించి నియంత్రించవచ్చని సురేంద్ర సింగ్ సూచించడం గమనార్హం. ఉదయం ఆవు మూత్రాన్ని ఖాళీ కడుపుతో తాగితే మంచిది అని సూచించారు. తాను సైన్స్‌ను నమ్ముతున్నానో లేదో గాని ఆవు మూత్రాన్ని పూర్తిగా విశ్వసిస్తానని సురేంద్ర సింగ్ చెప్పడం గమనార్హం. తాగిన తర్వాత అరగంట ఏమీ తినవద్దని సూచించాడు.

Read more RELATED
Recommended to you

Latest news