రాహుల్ గాంధీ పై బిజెపి ఎంపీ సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు

-

కాంగ్రెస్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ పై బిజెపి ఎంపీ సంజయ్ జైశ్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియాతో బిజెపి ఎంపీ సంజయ్ మాట్లాడుతూ.. విదేశీ మహిళలకు పుట్టిన వ్యక్తి దేశభక్తుడు కాలేడని వ్యాఖ్యానించారు. అంతేకాదు 2000 సంవత్సరాల క్రితం చాణక్యుడు చెప్పిన మాటలనే తాను ఈరోజు గుర్తు చేశానని సమర్థించుకున్నారు.

విదేశాల్లో ఇండియాను రాహుల్ గాంధీ అవమానించారని.. మన ప్రజాస్వామ్యం, కోర్టులు, జర్నలిస్టులు అన్నీ తప్పు అని అన్నారంటే.. రాహుల్ భారతదేశాన్ని విశ్వసించరని స్పష్టమవుతుందని విమర్శించారు. రెండుసార్లు మోడీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని యువరాజులా భావించే రాహుల్ గాంధీ జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఎంపీ సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news