కేంద్రకేబినెట్‌లోకి మరో తెలంగాణ ఎంపీ?

-

హైదరాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కసరత్తులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తున్నారట. గత ఎన్నికల్లో ఘటన విజయం సాధించి రెండోసారి ప్రధానిగా పదవి చేపట్టిన తర్వాత మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరించలేదు. అందుకే త్వరగా కేంద్ర మంత్రి వర్గాన్ని విస్తరించాలని అనుకుంటున్నారట. ఒకటి, రెండు రోజుల్లో మోదీ తన మంత్రివర్గాన్ని విస్తారిస్తారని తెలుస్తోంది. 81 మందితో తన కేబినెట్‌ను మోదీ ప్రకటిస్తారని సమాచారం.

ప్రస్తుతం 53 మందితో మోదీ మంత్రి వర్గం ఉంది. కొత్తగా తన మంత్రివర్గంలోకి మరో 28 మందికి ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. అయితే ఈసారి తెలంగాణకు చెందిన మరో ఎంపీకి ఛాన్స్ దక్కుతుందని స్థానిక బీజేపీ నేతలు అంటున్నారు. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు పేరును ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్‌లో కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నారు. మరి తెలంగాణ నుంచి రెండో వ్యక్తిగా బాపూరావుకు అవకాశం ఇస్తారో లేదో తెలియాలంటే మరో రెండు, మూడు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news