బిజెపి వాళ్లు రాజకీయ లబ్ధి కోసం నాటకం ఆడుతున్నారు – మంత్రి ఎర్రబెల్లి

-

సీఎం కేసీఆర్ గిరిజనులకు 10% రిజర్వేషన్ జీవో ప్రకటిచడంతో జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిజనులకి 10% రిజర్వేషన్ పెంచడానికి అసెంబ్లీ తీర్మానం చేసినకా కేంద్రం సరిగా స్పందించలేదన్నారు.

సీఎం కేసీఆర్ పట్టుదలతో గిరిజనులకు జనాభా ప్రకారం 10% రిజర్వేషన్ పెంచాలని గట్టి నిర్ణయం తీసుకొని చేశారని అన్నారు. గిరిజన తండాలని గ్రామపంచాయితి గా తీర్చి దిద్దిన ఘనత మన సీఎం కేసీఆర్ దేనన్నారు మంత్రి ఎర్రబెల్లి. గిరిజన తాండలలో ప్రతి గ్రామ పంచాయితీకి ఒక భవనం ఏర్పాటుకి ఆదేశించిన ఘనత మన సీఎం కేసీఆర్ దే అన్నారు. తెలంగాణ రావటంతో గాని, నైజాం వ్యతిరేకంగా చేసిన పోరాటానికి, బీజేపీ కి ఎటువంటి సంబంధం లేదన్నారు.

రాజకేయ లబ్ది కోసం తెలంగాణకి వచ్చి బీజేపీ వాళ్ళు పోజులు కొడుతున్నారని ఆరోపించారు. స్వతంత్ర్య ఉద్యమంలోగాని,నిజాం కి వ్యతిరేక పోరాటంలో గాని, భూస్వాముల వ్యతిరేకంలో చేసిన పోరాటంలో గాని, తెలంగాణ సాధించుకున్న దాంట్లో బీజేపీ కి ఎటువంటి పాత్ర లేదని… బీజేపీ వాళ్ళు అమిద్ షా, కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు రాజకీయ లబ్ది కోసం నాటకం ఆడుతున్నారు అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news