బిజెపి ఓటు బ్యాంకు రాజకీయాలకు ఓబీసీ అంశాన్ని వాడుకుంటుంది – VH

-

రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు జేపీ నడ్డా, బండి సంజయ్ కొత్త ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. రాహుల్ గాంధీ ఓబీసీలను కించ పరుస్తూ మాట్లాడాడని, రాహుల్ గాంధీ ఓబీసీలకు క్షమపణలు చెప్పాలని కొత్త వాదన వినిపిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎందుకు క్షమపణలు చెప్పాలి ? అధానిపై పార్లమెంట్ లో ప్రశ్నించినందుకా..? అని నిలదీశారు వీహెచ్.

అదాని విషయం పై ప్రజల దృష్టి మరల్చడానికే ఓబీసీల అంశాన్ని తెర మీదకు తెచ్చారని మండిపడ్డారు. ఏప్రిల్ 1 వ తేదిన అన్ని పార్టీల తో సోమజిగూడా ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు. రాహుల్ గాంధీ ఓబీసీలను ఎక్కడ కించపరిచారు అనే విషయంపై చర్చిద్దామన్నారు. ఓబీసీలకు గత ప్రభుత్వాలు ఎం చేశాయి… ఇప్పుడు తొమ్మిదేళ్ళలుగా బీజేపీ ప్రభుత్వం ఎం చేసింది? అనే విషయంపై చర్చిద్దాం అన్నారు వి హనుమంతరావు.

అదాని గురించి మాట్లాడితే ఓబిసి అంశాన్ని తెరమీదకు తెచ్చి ప్రజల దృష్టి మరల్చడానికీ బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయలకు బీజేపీ.. ఓబీసి అంశాన్ని వాడుకుంటుందన్నారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలతో సహా ఓబీసీ విద్యార్థులు, మేధావులు పాల్గొనాలని కోరారు. వాయినడ్ ఎన్నికలకు 30 రోజుల గడువును ఇస్తూ సీఈసి నిర్ణయం తీసుకుందని.. సీఈసికి ఉన్న ఆలోచన పార్లమెంట్ లో స్పీకర్ లేదని తేలిపోయిందన్నారు. స్పీకర్ బీజేపీ పార్టీకి తోత్తుగా పని చేస్తున్నాడని మండిపడ్డారు వీ హనుమంతరావు.

Read more RELATED
Recommended to you

Latest news