ఇప్పుడు ముగ్గురమే.. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే : ఈటల సంచలనం

-

ఇప్పుడు ముగ్గురమే.. రాబోయేది బీజేపీ సర్కార్ అని హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. గన్ పార్క్ లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు బీజేపీ ఎమ్మెల్యే లు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు నివాళులు అర్పించారు. అనంతరం ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమ విధాన పత్రమే గవర్నర్ గారి ప్రసంగమని చెప్పారు.

దీని మీద చర్చించడం ఎమ్మెల్యే గా మా హక్కు ఉందని… కానీ కెసిఆర్ 40 సంవత్సరాలుగా వస్తున్న విధానాన్ని తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారని మండిపడ్డారు. గవర్నర్ గారి కే దిక్కులేకుండా చేస్తే మా పరిస్థితి ఏంటో మాకు అర్థం అవుతుందని.. మైకులు కట్ చేసి అవమానిస్తారు. మాట్లాడే అవకాశం ఇస్తారో లేదో అని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో గంటల తరబడి మాట్లాడే అవకాశం మాకు ఎప్పుడు దక్కిందని.. మేము ముగ్గురము కావొచ్చు … కానీ రాబోయేది బీజేపీ ప్రభుత్వమని చెప్పారు.

రాష్ట్రంలో నియంతృత్వ, దోపిడీ పాలన కొనసాగుతుందని.. అసెంబ్లీ లో మాట్లాడే అవకాశం రాకపోతే ప్రజాక్షేత్రంలో ఎండగడతామని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మా శక్తి మేరకు ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నామని.. కెసిఆర్ గారు ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించండి… లేదంటే రేపు మీకు కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news