సంగారెడ్డిలో భారీ పేలుళ్లు..పెద్ద ఎత్తున మంటలు !

-

సంగారెడ్డి జిల్లా బొల్లారం కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వింధ్యా ఆర్గానిక్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు  చెలరేగినట్టు చెబుతున్నారు. పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించి అనంతరం మంటలు కంపెనీ మొత్తం వ్యాపించాయి. అక్కడి రియాక్టర్‌లో పేలుడు సంభవించడంతో భారీ అగ్ని ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు.

కంపెనీలో కొంత మంది కార్మికులు కూడా చిక్కుకున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  భారీ పేలుళ్లతో కార్మికులు పరుగులు పెట్టారు. గాయాలతో కింద పడి కార్మికులు అల్లాడుతున్నారని చెబుతున్నారు. గాయాలపాలైన కార్మికులను ఆస్పత్రికి తరలిస్తున్నారు.  ఇక, పేలుళ్లు, మంటలతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి. కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో దాదాపు కిలోమీటర పరిధిలో పొగ కమ్ముకుపోయింది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news