కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డిని క‌లిసిన బాలీవుడ్ న‌టి…!

-

తాజాగా బ్యూటీ పాయ‌ల్ ఘోష్ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డిని భేటీ అయ్యారు. పాయల్ కిషన్ రెడ్డికి తనకు తక్షణమే న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. బాలీవుడ్ బ్యూటీ పాయ‌ల్ ఘోష్ ద‌ర్శ‌కుడు దర్శకుడు అనురాగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి అందరికీ విదితమే. ఇక పాయల్ ఫిర్యాదు మేరకు ముంబై పోలీస్ అధికారులు దర్శకుడిపై అత్యాచార కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా అనురాగ్ ను పోలీస్ అధికారులు దాదాపు ఎనిమిది గంటలపాటు విచారణ చేశారు.

ఇప్పటికి కూడా అనురాగ్ పోలీస్ అధికారులతో తనపై చేసిన ఆరోపణలు అన్నీ కూడా ఆధారాలు లేవు అని తీవ్రంగా ఖండించారు. ఇక తనకు న్యాయం చేకూరాలని ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ ను కూడా పాయల్ ఆశ్రయించిన సంగతి అందరికీ తెలిసినదే. ఇలాంటి సమస్యలు ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొంటూనే ఉన్నారు.. ఇప్పుడు కఠిన చర్యలు తీసుకునే సమయం వచ్చింది అని సోషల్ మీడియా వేదికగా చేసుకొని పాయల్ తెలియజేసింది.

Read more RELATED
Recommended to you

Latest news