ఒకే సినిమాలో పవన్ కళ్యాణ్‌-రానా

-

తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టార్ సినిమాలు రావడం కొత్తేమీ కాదు. గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. తాజాగా అరుదైన కాంబినేష‌న్ తెర‌పై సంద‌డి చేయ‌నున్న‌ట్టు చిత్ర పరిశ్రమలో ఈ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. అయితే ఆ ఇద్ద‌రు స్టార్లు ఎవ‌ర‌నే క‌దా మీ సందేహం. వారే ప‌వ‌న్ కళ్యాణ్‌, రానా. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ చిత్రంగా నిలిచిన అయ్య‌ప్ప‌న్నుమ్ కొషియుమ్ ప్రాజెక్టును తెలుగులో రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-రానా హీరోలుగా న‌టించ‌నున్నార‌ని టాక్ వినిపిస్తుంది. ప‌వ‌న్ కళ్యాణ్ ప్ర‌స్తుతం న‌టిస్తోన్న వ‌కీల్ సాబ్ షూటింగ్ ఈ నెలలో పూర్తికానుందని సమాచారం.

pawan - rana
pawan – rana

ఇక క్రిష్ తో ప‌వ‌న్ చేయ‌నున్న సినిమాకు మ‌రికొంత స‌మ‌యం ప‌ట్ట‌నుండ‌టంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు డిసెంబ‌ర్ నుంచి మార్చి వ‌ర‌కు టైం దొరుకుది సమాచారం. ఇక ఈ పీరియ‌డ్‌లో రానాతో క‌లిసి మ‌ల్టీస్టారర్ ను చేయాల‌ని ప‌వ‌న్ అనుకుంటున్నారంట. ప‌వ‌న్ ఈ సినిమా చేసే అవ‌కాశ‌ముండ‌టంతో రానా కూడా ఈ ప్రాజెక్టు చేయాల‌ని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇక ప‌వ‌న్‌-రానా కాంబినేష‌న్ పై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నేది కూడా తెలియాల్సి ఉంది మరి.

Read more RELATED
Recommended to you

Latest news