ఢిల్లీలో ఇజ్రాయిల్ దౌత్య కార్యాలయం వద్ద బాంబు పేలుడు

-

ఢిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయానికి కూతవేటు దూరంలో కొద్ది సేపటి క్రితం పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడు దాటికి మూడు కార్లు ధ్వంసం అయ్యాయని అంటున్నారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగ లేదని తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఢిల్లీ స్పెషల్‌ టీం సంఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించింది. పేలుడుకు కారణాలు ఏమై ఉంటుందా అని బాంబ్‌స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టింది.

బీటింగ్ రిట్రీట్ జరుగుతున్న ఏరియాకి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఇది జరగడం సంచలనంగా మారింది. అయితే అందుతున్న సమాచారం మేరకు ఇది ఆకతాయిల చర్య అని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ద్రువీకరించాల్సి ఉంది. పేలుడుకు ఐఈడీ ఉపయోగించినట్లు అధికారులు నిర్ధారించారు. పూల కుండీలో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news