తెలంగాణలో పేలుళ్ళ కలకలం.. అసలేమైంది ?

-

తెలంగాణలో పేలుళ్ళ కలకలం రేగింది. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మరుకు గల్లీలో దుర్గయ్య అనే వ్యక్తి అద్దెకుంటున్న ఇంట్లో భారీ పేలుళ్ళు చోటు చేసుకున్నాయి. పేలుళ్ల తాకిడికి మంటలు చెలరేగి దుర్గయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో చికిత్స కోసం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

దుర్గయ్య పంట పొలాల వద్ద అడవి పందులను చంపడానికి నాటు బాంబులు తయారు చేస్తాడని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఇక పేలుళ్లపై కేసు నమోదు చేసిన రామాయం పేట పోలీసులు పేలుళ్ళు ఎందుకు జరిగాయి అనే విషయం మీద విచారణ చేస్తున్నారు. నిజానికి చాలా చోట్ల ఇలా అనధికార బాంబులు తయారీ చేస్తూ ఉంటారు. అయితే జాగ్రత్తలు ఏమీ తీసుకోక పోవడం వలన ఇలా జరుగుతూ ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news