షాకింగ్ : బెంగాల్ మంత్రి మీద బాంబు దాడి

-

పశ్చిమ బెంగాల్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. బెంగాల్ కార్మిక శాఖ మంత్రి జకీర్ హుసేన్‌  మీద నిన్న పొద్దుపోయాక కొంతమంది వ్యక్తులు బాంబులతో దాడి చేశారు. ఈ దాడిలో మంత్రి జాకీర్ హుసేన్‌ కు తీవ్రగాయాలయ్యాయని చెబుతున్నారు. నిన్న రాత్రి జాకీర్ హుసేన్ కోల్‌ కతాకు వెళ్లేందుకు బయలుదేరారు. రైలు ఎక్కేందుకు ఆయన నిమ్టితా స్టేషన్ వైపు నడుచుకుంటూ వెళుతుండంగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయన మీద బాంబులతో దాడి చేశారని తెలుస్తోంది.

దీంతో ఆయనతో పాటు ఉన్న ఇద్దరు కూడా తీవ్రంగా గాయ పడ్డారు. ఇక వెంటనే ఆయనని ఆసుపత్రికి తరలించారు. జాకీర్ హుస్సేన్ ముర్షిదాబాద్ జిల్లాలోని జంగిపూర్ నియోజవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక ఈ బాంబు దాడి ఘటన సంచలనంగా మారింది. గత కొద్ది రోజులుగా తృణముల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news