ఖుషి థియేటర్లో భోగి మంటలు.. పూనకాల్లో మునిగి తేలుతున్న ఫ్యాన్స్..!

-

ప్రస్తుతం ఎక్కడ చూసినా రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతున్న నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమాను కూడా రిలీజ్ చేశారు. డిసెంబర్ 31న ఇయర్ ఎండ్ సందర్భంగా థియేటర్లలో 4కే ప్రింట్ తో రిలీజ్ చేయగా థియేటర్ల వద్ద అభిమానులు పూనాకాలతో ఊగిపోతూ నానా రభస చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ క్రేజ్ కి థియేటర్స్ తట్టుకోవడం చాలా కష్టం. ఆయన సినిమాలు విడుదలవుతున్నాయి అంటే చాలు..అభిమానుల కోలాహలం తో థియేటర్స్ ఎక్కడ బద్దలై పోతాయో అని ఓనర్స్ భయపడిపోతూ ఉంటారు.

గతంలో కూడా ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. ఇక గత ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు వేసుకున్న జల్సా స్పెషల్ షోస్ కూడా అభిమానుల కోలహాలు థియేటర్స్ లో ఒక రేంజ్ లో ఉండింది . కానీ ఆ సమయంలోనే థియేటర్స్ లో సీట్స్ కూడా విరిగిపోయాయి. స్క్రీన్స్ తిరిగిపోవడంతో పాటు థియేటర్స్ అద్దాలు కూడా పగిలిపోయాయి. ఇలా చాలానే జరిగాయి. అప్పటినుండి పవన్ కళ్యాణ్ సినిమాలకు స్పెషల్ షోస్ నిర్వహించడానికి కొన్ని మెయిన్ థియేటర్స్ నిరాకరించాయి. కానీ నిన్న ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ కెరియర్ లో మైలురాయిగా నిలిచిపోయిన ఖుషి సినిమాను ప్రీ రిలీజ్ చేశాడు ఆ చిత్రం నిర్మాత ఏ ఎం రత్నం.

ఒక కొత్త సినిమా విడుదల అయితే ఎలాంటి హంగామా ఉంటుందో ఈ సినిమాకు అంతకుమించి హంగామా చేశారు పవన్ కళ్యాణ్ అభిమానులు . సోషల్ మీడియా మొత్తం ఖుషి మేనియాతో మునిగిపోయింది. ఎక్కడ చూసినా థియేటర్స్ లో చేసిన సంబరాల వీడియోలే కనిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే జగ్గయ్యపేటలోని కమల అనే థియేటర్లో అత్యుత్సాహంతో థియేటర్లో పడిన పేపర్స్ అన్నింటిని పోగిచేసి భోగి మంటలు వేయడం కలకలం రేపుతోంది. మొత్తానికి అయితే అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news