పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో బుక్ ఫెయిర్

-

పుస్తకాన్ని మించిన స్నేహితుడు లేడు.. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అంటారు. పుస్తక పఠనం మనిషి జ్ఞానసముపార్జనకు మూలమైన ఆయుధం. ఇంతటి అమూల్యమైన పుస్తకాలన్ని ఒకే చోట కొలువుదీరితే.. వాహ్.. ఇక పుస్తక ప్రియులకు పండగే. బుక్ లవర్స్ కోసం హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని మారుతీ గార్డెన్‌ లో​ ‘లోడ్ ది బాక్స్​’ అనే థీమ్‌తో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. దిల్లీకి చెందిన కితాబ్‌ లవర్స్‌ అనే సంస్థ ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను ప్రముఖ రచయిత దుర్జోయ్‌ దత్తా ప్రారంభించారు.

బాక్సు కొనుగోలు చేసిన తర్వాత అందులో పట్టినన్ని పుస్తకాలు వినియోగదారులు తీసుకెళ్లవచ్చు. 10 లక్షల పుస్తకాలతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో అమ్మకాలు చేయడంతో పాటు పాత పుస్తకాలు కొనుగోలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 9 వరకు ప్రదర్శన అందుబాటులో ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news