ఉద్యోగులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే క్షమించేది లేదు : బొత్స

-

ఉద్యోగులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే క్షమించేది లేదని బొత్స సత్యనారాయణ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం కరెక్ట్ కాదని.. ఆందోళన చేస్తున్న ఉద్యోగులు కొంత మంది మాటలు బాధాకరంగా ఉన్నాయని తెలిపారు. భాష అదుపులో ఉండాలని.. సంయమనం లేకుండా ఉద్యోగులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగులకు కావాల్సింది ఘర్షణ లేక సమస్య పరిష్కారమా?? బాధ్యత రహితంగా మాట్లాడుతున్న వారిని ఉద్యోగ సంఘాల నేతలు కట్టడి చేయాలన్నారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు.

పర్యవసానాలు చూడాల్సి వచ్చే పరిస్థితి వద్దని.. ముఖ్యమంత్రి గారు తపన పడుతున్నారు… ఆర్ధిక పరిస్థితి వల్ల చేయలేక పోతున్నారని మీరే చెప్పారుగా.. ఇప్పుడీ మాటలు ఏంటి?? అని ప్రశ్నించారు. ఉద్యోగులతో చర్చించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. అధికారులు చెప్పిన లెక్కల్లో తేడాలు ఉన్నాయని అభ్యంతరాలు ఉంటే కాదని చెప్పండని పేర్కొన్నారు. ఉద్యోగస్తులు ఎవరి ప్రొవేకేషన్ లోకి వెళ్ళవద్దు అని కోరుతున్నానని.. సానుకూలంగా ఉండాలని నేనూ కోరుకుంటున్నానని చెప్పారు. ప్రతిపక్షాలు రాజకీయం చేసి లబ్ది పొందాలని అనుకుంటాయని.. మంచి వాతావరణాన్ని పాడు చేయవద్దని నేను కోరుతున్నానని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news