బ్రేకింగ్:పూర్తిగా కోలుకున్న అమిత్ షా

-

కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు పూర్తిగా. అదే విధంగా ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఆయన బయటపడ్డారు అని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. కాసేపటి క్రితం ఆయన హెల్త్ బులిటెన్ ని విడుదల చేసారు వైద్యులు. ఈ సందర్భంగా ఆయన కరోనా నుంచి కోలుకున్నారు అని త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వివరించారు.

ఇటీవల కరోనా బారిన పడిన మిత్ షా ఆ తర్వాత ఇతర అనారోగ్య సమస్యలతో తిరిగి మళ్ళీ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఈ నెల 18 న ఆయన ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. అప్పుడు విషమంగా ఉందని కొందరు కథనాలు ప్రసారం చేసారు. అమిత్ షా తో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు కూడా కరోనా బారిన పడ్డారు. వారు అందరూ తిరిగి కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news