బ్రేకింగ్; మరో కరోనా మరణం…!

-

కరోనా వైరస్ ను ఏ విధంగా అరికట్టేందుకు ప్రభుత్వాలు, ప్రజలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అయినా కూడా ఒక్కటిగా కరోనా కేసులు దేశవ్యాప్తంగా నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ కారణం గా మన దేశంలో ఇద్దరు మృతి చెందగా, ఈ రోజు మహారాష్ట్రకు చెందిన 64 ఏళ్ల వ్యక్తి మృతిచెందాడు. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం మన దేశంలో 125 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.

ఇప్పటికే కర్ణాటకకు చెందినవారు ఒకరు , ఢిల్లీకి చెందిన ఒక మహిళ మృతి చెందగా, ఈ రోజు ముంబైలోని కస్తుర్బా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 64 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. అయితే ప్రస్తుతం మన దేశంలో మహారాష్ట్రలో అత్యధికంగా 39 కరోనా కేసులు నమోదు అవ్వగా, హర్యానాలో 14, ఉత్తరప్రదేశ్‌లో 13, కేరళలో 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 8 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

అక్కడ ఈ వైరస్ బాగా విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే తెలంగాణలో మొత్తం 4 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒక వ్యక్తిని డిశ్చార్జి చేశారు. మిగతా ముగ్గురూ గాంధీ ఆసుపత్రి లో ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాలు దాదాపు షట్ డౌన్ ప్రకటించాయి.

Read more RELATED
Recommended to you

Latest news