BREAKING: పెరిగిన అమూల్ పాల ధర

-

ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుంటే.. నిత్యవసర సరుకుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక ప్రతిరోజు అవసరమయ్యే పాల ధరలు కూడా ఇటీవల పెరిగిన విషయం తెలిసిందే. ముందే కరోనాతో ఇబ్బందులు పడి కోలుకుంటున్న తరుణంలో ధరల మోత మోగిపోతున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా అమూల్ పాల ధర పెరిగింది. లీటర్ పై రూ.2 రూపాయలు పెంచుతున్నట్లు గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ప్రకటించింది.

దీంతో గుజరాత్ తో పాటు ఢిల్లీ, ముంబై సహా అముల్ పాలు విక్రయించే రాష్ట్రాల్లో ధర పెరగనుంది. పెరిగిన ధరతో అముల్ గోల్డ్ మిల్క్ అర లీటర్ ధర రూ.31 కి, అమూల్ టాటా రూ.25 కి, అమూల్ శక్తి రూ.28 కి చేరనుంది. ఈ పెరిగిన ధరలు రేపటినుండి అమల్లోకి రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news