BREAKING : కాంగ్రెస్‌లోకి వెళ్లడంపై క్లారిటీ ఇచ్చిన గులాంనబీ ఆజాద్‌

-

మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలో గులాంనబీ ఆజాద్‌ చేరుతున్నట్లు వస్తున్న కథనాలపై ఆయన స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరుతున్నట్లు వస్తున్న కథనాలు చూసి షాక్ అయ్యానని గులాం నబీ ఆజాద్ చెప్పారు. దురదృష్టవశాత్తు, ప్రస్తుతం కాంగ్రెస్‌లోని ఒక వర్గం నాయకులు ఇటువంటి కథనాలను ప్రచారం చేయిస్తున్నారని తెలిపారు. తమ డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ నాయకులను, మద్దతుదారులను నిరుత్సాహపరిచేందుకు ఇలా చేస్తున్నారని చెప్పారు.

Congress Lashes Out At Ghulam Nabi Azad For Fabricating Charges Against  Party

తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాననే వార్త నిరాధారమైనదని స్పష్టం చేశారు. యన మళ్ళీ కాంగ్రెస్ లో చేరాలని భావిస్తున్నారని, ఇందుకోసం ఆజాద్, కాంగ్రెస్ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అలాగే, రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని గులాంనబీ ఆజాద్ ను పలువురు కాంగ్రెస్ నేతలు ఆహ్వానించారని కూడా ప్రచారం జరుగుతోంది. గులాం నబీ ఆజాద్ కు, కాంగ్రెస్ మధ్య ఉన్న దూరాన్ని తొలగించే పనిని కాంగ్రెస్ పార్టీ పలువురు నేతలకు అప్పగించిందని వార్తలు వచ్చాయి.

వీటన్నింటిపై గులాం నబీ ఆజాద్ స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరుతున్నట్లు వస్తున్న కథనాలు చూసి షాక్ అయ్యానని చెప్పారు. దురదృష్టవశాత్తూ, ప్రస్తుతం కాంగ్రెస్‌లోని ఒక వర్గం నాయకులు ఇటువంటి కథనాలను ప్రచారం చేయిస్తున్నారని తెలిపారు.
x

Read more RELATED
Recommended to you

Latest news