బ్రేకింగ్: మరోసారి జమ్ములో భారీ ఎన్కౌంటర్

-

దక్షిణ కాశ్మీర్‌ లోని పుల్వామా జిల్లాలోని కాకాపోరా ప్రాంతంలో మంగళవారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగాయని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌ లో భారత సైన్యానికి చెందిన ఇద్దరు సైనికులు గాయపడినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. కాకపోరాలోని మార్వాల్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిర్దిష్ట సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీకి చెందిన 50 ఆర్‌ఆర్, సిఆర్‌పిఎఫ్ సంయుక్త బృందం కార్డన్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసు అధికారి జాతీయ మీడియాకు తెలిపారు.

ముగ్గురు నుంచి ఆరుగురు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో నక్కి ఉన్నట్టు భావిస్తున్నారు. పోలీసులు, ఆర్మీ అక్కడికి చేరుకోగానే ఉగ్రవాదులు వారిని గమనించి కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించి ఉండవచ్చు అని ఆర్మీ అధికారులు మీడియాకు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మీడియాకు పూర్తి సమాచారం అందలేదు.

Read more RELATED
Recommended to you

Latest news