బ్రేకింగ్: ఒకే రోజు రెండు గుడ్ న్యూస్ లు చెప్పిన టీటీడీ

-

టీటీడీ తిరుమల శ్రీవారి భక్తులకు ఒకే రోజు రెండు గుడ్ న్యూస్ లు చెప్పింది. ఆన్ లైన్ లో కల్యాణోత్సవ సేవలో పాల్గొంటున్న భక్తులకు టీటీడీ తీపి వార్త అందించింది. ఇక పై ఆన్ లైన్ లో సేవలో పాల్గొన్న భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించాలని నిర్ణయించిన టీటీడీ… సేవ చేసుకున్న 90 రోజులలో ఎపుడైనా సుపథం ద్వారా భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్టు ప్రకటన చేసింది.

ప్రసాదాన్ని మాత్రం పోస్టల్ ద్వారానే పంపిణి చేయనుంది టీటీడీ. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటాను మరో సారి పెంచింది బోర్డు. రేపటి నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ప్రతి రోజు అదనంగా మరో 3వేల టిక్కెట్లను భక్తులకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచింది టీటీడీ. తాజాగా పెంచిన సంఖ్యతో 13 వేలుకు చేరుకుంది టిక్కెట్ల సంఖ్య. దీనిపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news